Monday, April 29, 2024

కారు న‌దిలోకి దూసుకెళ్లి… న‌లుగురు గ‌ల్లంతు

ఓ కారు వంతెనపై వేగంగా వెళ్తూ.. నదిలోకి దూసుకెళ్లిన దుర్ఘటన గోవాలో చోటుచేసుకుంది. దక్షిణ గోవా జిల్లాలోని జువారి నది వంతెనపై నుంచి వస్తున్న కారు ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయింది. నదిలో పడిన కారును ఓ మహిళ నడుపుతోందని, కారులో నలుగురున్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఇండియన్ కోస్ట్ గార్డ్స్, నేవీ, అగ్నిమాపకశాఖ, ఎమర్జెన్సీ సర్వీసుల శాఖ, గోవా పోలీసులు కలిసి నదిలో పడిన వాహనంతో పాటు అందులో ఉన్న వారిని వెలికి తీసేందుకు గాలింపు చేపట్టారు.
గోవా రాజధాని పనాజీకి 15 కిలోమీటర్ల దూరంలోని కొర్టాలిమ్ గ్రామం వద్ద జాతీయ రహదారి వంతెనపై కారును దాటబోయి నదిలో పడిపోయిందని పోలీసులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement