Friday, March 29, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్… మొక్క‌లు నాటిన డీసీపీ అఖిల్ మ‌హ‌జ‌న్‌

పెద్దపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పెద్దపల్లి ఇన్‌చార్జి డీసీపీ అఖిల్ మహజన్‌ స్వీకరించారు. గురువారం పెద్దపల్లి డీసీపీ కార్యాలయంలో మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామ్యం కావడం సంతోషాన్నిచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించడం ద్వారా హరిత తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. రోజు రోజుకు కలుషితమవుతున్న పర్యావరణం మొక్కల పెంపకం ద్వారానే రక్షించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ ప్రదీప్ కుమార్‌, ఎస్‌ఐ రాజేశ్‌తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement