Saturday, April 27, 2024

రూ.35ల‌క్ష‌ల న‌గ‌దు ఉన్న బ్యాగ్ ని కొట్టేసిన బాలుడు

ఏటీఎం మెషిన్ లో నింపేందుకు రూ.35ల‌క్ష‌ల న‌గ‌దుని బ్యాగులో పెట్టి ఉంచ‌గా..ఓ బాలుడు ఆ బ్యాగ్ ని తీసుకెళ్ళిన ఘ‌ట‌న పంజాబ్ పాటియాలాలో చోటు చేసుకుంది. ఈ దృశ్యాల‌న్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఉదయం రద్దీ వేళల్లో 11.37 గంటల సమయంలో ఇది జరిగింది. దీంతో సిబ్బంది ఆలస్యంగా గుర్తించారు. ఓ బాలుడు బ్యాంకు శాఖలోకి మరో వ్యక్తితో కలసి ప్రవేశించాడు. బ్యాంకులోనే 20 నిమిషాల పాటు అంతా పరిశీలించారు. ఆ తర్వాత నగదు బ్యాగు ఉంచిన ఐదో నంబర్ కౌంటర్ దగ్గరకు బాలుడు వెళ్లి 30 సెకన్లలోపే, దాన్ని తీసుకుని బయటకు వచ్చేశాడు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్టు ఎస్పీ వజీర్ సింగ్ తెలిపారు. ఈ వ్యవహారం వెనుక బ్యాంకు సిబ్బంది సహకారం ఉండొచ్చన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement