Thursday, April 25, 2024

Big Breaking | కూలీల ఆటోను ఢీకొన్న కారు.. ముగ్గురి పరిస్థితి విషమం

పరకాల (ప్ర‌భ న్యూస్‌): హన్మకొండ జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఇవ్వాల (బుధ‌వారం) పరకాల- భూపాలపల్లి ప్రధాన రహదారి చలివాగు వద్ద కూలీలతో వెళుతున్న ఆటోను కారు ఢీకొట్టింది. పత్తిపాక నుంచి పోచంపల్లి గ్రామానికి మిర్చీ ఏరడానికి కూలీలు వెళ్తుండ‌గా ఈ ఘటన జరిగింది.

ఈ ప్రమాదంలో పలువురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ యాక్సిడెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియలిసి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement