Sunday, May 5, 2024

కరోనాతో చనిపోయిన వారందరికీ ఎక్స్ గ్రేషియో…!! జగన్ ఆదేశాలు

దేశంలో లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతిరోజు కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి లక్షలాది మంది చనిపోయారు. కాగా ఈ సమయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా తో చనిపోయిన వైద్య సిబ్బందికి వైద్యులకు ఎక్స్ గ్రేషియోను ప్రకటించింది. కరోనాతో డాక్టర్ చనిపోతే కుటుంబానికి 25 లక్షలు…స్టాప్ నర్స్ చచ్చిపోతే కుటుంబాలకు 20 లక్షలు ఎం ఎన్ వో ,ఎఫ్ ఎన్ ఓ చనిపోతే వారి కుటుంబాలకు 15 లక్షలు.. ఇతర వైద్య సిబ్బంది చనిపోతే 10 లక్షల ఎక్స్ గ్రేషియో ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు లకు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement