Thursday, April 25, 2024

ఏపీలో కొత్తగా 4549 కరోనా కేసులు….

ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. అలాగే రాష్ట్రంలో గత 24 గంటల్లో 87,756 సాంపిల్స్ ని పరీక్షించగా 4,549 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. కోవిడ్ వల్ల చిత్తూర్ లో పన్నెండు మంది, ప్రకాశం లో ఎనిమిది, పశ్చిమ గోదావరి లో ఆరుగురు, కృష్ణ లో ఐదుగురు, అనంతపూర్ లో నలుగురు, తూర్పు గోదావరి లో నలుగురు, శ్రీకాకుళం లో నలుగురు, గుంటూరు లో ముగ్గురు, కర్నూల్ లో ముగ్గురు, విశాఖపట్నం లో ముగ్గురు, విజయనగరం లో ముగ్గురు, వైఎస్ఆర్ కడప లో ఇద్దరు మరియు నెల్లూరు లో ఇద్దరు మరణించారు.

గడచిన 24 గంటల్లో 10,114 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 2,05,38,738 సాంపిల్స్ ని పరీక్షించారు. ఇక రాష్ట్రంలో ఇప్పటిదాకా 18,14,393 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 17,22,381 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 80,013 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 11,999కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement