Thursday, May 2, 2024

మే 7 నుంచి ‘ఆహా’లో అనసూయ కొత్త సినిమా

గ‌త ఏడాది క‌రోనా వ‌ల‌్ల సినీ ప‌రిశ్ర‌మ తొమ్మిది నెల‌లు పూర్తిగా స్తంభించి కోట్లు న‌ష్ట‌పోయింది. ఇక ఇప్పుడు సెకండ్ వేవ్ వ‌ల‌న షూటింగ్స్ ఆగిపోయాయి. సినిమా థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. దీంతో కొంద‌రు చిత్ర నిర్మాత‌లు చేసేదేం లేక త‌మ సినిమాల‌ను ఓటీటీలో విడుద‌ల చేసేందుకు రంగంలోకి సిద్ధం చేసుకుంటున్నారు. అన‌సూయ న‌టించిన ‘థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్’ చిత్రం మే 7న ఆహాలో విడుద‌ల కానున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న థ్యాంక్ యు బ్రదర్ సినిమాను నూతన దర్శకుడు రమేష్ రాపర్తి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అనసూయ ప్రెగ్నెంట్ ఉమెన్‌లో పాత్రలో కనిపిస్తోంది. ఇప్ప‌టికే చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఇది నెటిజ‌న్స్ ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. మూవీపై అంచ‌నాలు పెంచింది. థియేట‌ర్లలో సినిమాను చూడాల‌ని అభిమానులు భావించ‌గా కరోనా వ‌ల‌్ల ఓటీటీలో చూడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement