Friday, April 19, 2024

బీజేపీ బాధితురాలిగా దేశాన్ని మార్చొద్దు: రాహుల్ గాంధీ ఫైర్..

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కరోనా, కోవిడ్ వ్యాక్సిన్లపై ఇప్పటి వరకు జరిగిన చర్చ చాలని… దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ను పూర్తిగా ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. దేశాన్ని కరోనా రహితంగా మార్చడానికి ఈ పని చేయాల్సిందేనని చెప్పారు. దేశాన్ని మీ పార్టీ బాధితురాలిగా మార్చవద్దని అన్నారు. వ్యాక్సిన్ ధరలకు రెక్కలు వచ్చిన తరుణంలో రాహుల్ గాంధీ స్పందించారు. ఇప్పటికే దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ వేరే వేరే ధరలకు లభ్యమవుతుండటంతో రాహుల్ పై విధంగా స్పందించారు. సీరమ్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ లు వాటి ధరలను అమాంతం పెంచేసిన కేంద్రం స్పందిచకపోవడంపై రాహుల్ గరం అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement