Friday, April 26, 2024

ఎమ్మెల్సీ కవిత పేరు చెప్పి మోసం…ఏకంగా లక్షల్లోనే !!

కెసిఆర్ కూతురు, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు చెప్పి ఆరు లక్షల యాభై వేల రూపాయలు కాజేశారు మోసగాళ్ళు. టీవీ ఛానల్ లో కీలక పోస్టు ఇప్పిస్తామని, అలాగే డబల్ బెడ్ రూమ్ కూడా వచ్చేలా చూస్తామంటూ మహమ్మద్ అలియాస్ స్వామి అనే వ్యక్తిని బురిడీ కొట్టించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు లక్షలకు పైగా టోపీ పెట్టారు. కామారెడ్డి జిల్లాకు చెందిన మహేష్ గౌడ్, వినోద్ లు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకటి వేములవాడ లో మరో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని ముహమ్మద్ ని బోల్తా కొట్టించారు. మహమ్మద్ ఖతర్ లో ఉంటాడు. కాగా ఇటీవల మహమ్మద్ ఖతర్ నుంచి రావడంతో ఎమ్మెల్సీ కవిత శాలువా పంపించారంటూ అతనికి ఓ శాలువా కూడా అందజేశారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కి సంబంధించిన తాళాలు కూడా అంటూ అతని చేతిలో తాళం చెవిని కూడా పెట్టారు. అంతేకాదు కవితతో డైరెక్టుగా మాట్లాడవచ్చని వాకి టాకీ కూడా అందజేశారు. అయితే ఆఖరికి ఇదంతా మోసమని తెలుసుకున్నా మహమ్మద్ కామారెడ్డి పోలీసులను ఆశ్రయించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement