Thursday, May 2, 2024

వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనంపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. హుస్సేన్ సాగర్​లో నిమజ్జనం నిషేధించాలన్న న్యాయవాది వేణుమాధవ్ పిటిషన్​పై హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే నిమజ్జనం సందర్భంగా ఆంక్షలు, నియంత్రణ చర్యలు సూచించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం, గణేష్ ఉత్సవ సమితి, పిటిషనర్ నివేదికలు సమర్పించాలని సూచించింది.

కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులు, కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని తెలిపింది. ప్రజల సెంటిమెంట్​ను గౌరవిస్తూనే.. ప్రస్తుత పరిస్తితులు కూడా చూడాలని సూచింది. ఎక్కడికక్కడ స్థానికంగానే నిమజ్జనం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కూడా హైకోర్టు వ్యక్తం చేసింది. సామూహిక నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ దెబ్బతినకుండా చూడాలని హైకోర్టు తెలిపింది. అందరి సూచనలు పరిగణనలోకి తీసుకుని ఈ నెల 6న తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు ప్రకటించింది.

ఈ వార్త కూడా చదవండి: దళిత బంధు పథకం.. మ‌రో నాలుగు మండ‌లాల్లో అమ‌లు

Advertisement

తాజా వార్తలు

Advertisement