Wednesday, May 1, 2024

హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో వినాయకుడి విగ్రహాల నిమజ్జనం జరుగుతుంటుంది. అయితే హుస్సేన్ సాగర్‌లో గణేష్, దుర్గామాత విగ్రహాల నిమజ్జనం నిషేధించాలన్న న్యాయవాది వేణుమాధవ్ పిల్‌పై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు సీరియస్ అయింది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం అంశంపై వివరాలు కోరిన హైకోర్టు.. వివరాలు సమర్పించాలని జీహెచ్‌ఎంసీ, సీపీకి ఆదేశాలు జారీ చేసింది. జనం భారీగా గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకుంటారు? రసాయనాలతో కూడిన విగ్రహాలు నిమజ్జనం చేయకుండా చర్యలేంటి? అని జీహెచ్‌ఎంసీ, సీపీని హైకోర్టు ప్రశ్నించింది.

ఈ అంశంపై సెప్టెంబరు 1లోగా నివేదికలు సమర్పించాలని జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సీపీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నివేదిక సమర్పించకపోతే సీనియర్ అధికారులు హాజరు కావాలని పేర్కొంది హైకోర్టు. ఇళ్లల్లోనే మట్టి గణపతులను పూజించాలని ప్రజలకు సూచిస్తామని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు.. అయితే దీనిపై స్పందించిన హైకోర్టు.. సూచనలు కాదు.. స్పష్టమైన ఆదేశాలు ఉండాలని ఫైర్ అయింది. మతపరమైన సెంటిమెంట్లు మంచిదే కానీ.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టొద్దని హైకోర్టు వ్యాఖ్యనించింది. ఇక వినాయక నిమజ్జనంపై తదుపరి విచారణ సెప్టెంబరు 1వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

ఈ వార్త కూడా చదవండి: స్వాతంత్య్ర దినోత్సవం రోజే అమానవీయ ఘటన

Advertisement

తాజా వార్తలు

Advertisement