Saturday, April 27, 2024

తెలంగాణలో పరీక్షలు వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేత

కరోనా నేపథ్యంలో తెలంగాణలోని అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిలో యూజీ, పీజీ పరీక్షలను ఈ నెల‌లోనే నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం సూచించిన విష‌యం తెలిసిందే. దీంతో ఇప్ప‌టికే అన్ని వ‌ర్సిటీలు పరీక్ష‌ల తేదీల‌ను ప్ర‌క‌టించి, అన్ని ఏర్పాట్లు చేసుకుని నిర్వ‌హిస్తున్నాయి. అయితే ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళ‌న‌లు చేస్తున్నాయి. ప‌రీక్ష‌లు వాయిదా వేయాంటూ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేయడానికి ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రయత్నించారు. ఈ పిటిషన్‌ స్వీకరణకు అనుమతి కోరారు.

అయితే.. దీనిపై స్పందించిన హైకోర్టు పరీక్షల అంశాన్ని అత్యవసర విచారణకు నిరాకరిస్తున్న‌ట్లు తెలిపింది. ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని ఇప్పుడు హైకోర్టుకు రావ‌డం ఏంట‌ని, ఇన్ని రోజులు ఏం చేశార‌ని నిల‌దీసింది. ఇప్పటికే పరీక్షలు ప్రారంభమయ్యాయ‌ని, ఇక‌ప దీనిపై జోక్యం చేసుకోలేమని తెలిపింది. లంచ్‌మోషన్ పిటిషన్‌కు అనుమతి ఇవ్వ‌బోమ‌ని చెప్పింది.

ఇది కూడా చదవండి: మంత్రి సబిత ఇంటిని ముట్టడించిన విద్యార్థులు.. అరెస్ట్

Advertisement

తాజా వార్తలు

Advertisement