Tuesday, April 30, 2024

Breaking: తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్, ఈసెట్ ఫలితాలను విడుదల చేశారు. 1,56,812మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పరీక్ష రాశారు. 80,575 మంది విద్యార్థులు అగ్రికల్చర్ అండ్ ఫార్మా పరీక్ష రాశారని తెలిపారు. ఇంజినీరింగ్ లో హైదరాబాద్ కు చెందిన లక్ష్మీసాయి, లోహిత్ రెడ్డి ఫస్ట్ ర్యాంక్ సాధించారన్నారు. అలాగే శ్రీకాకుళం సాయి దీపిక సెకండ్ ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. గుంటూరు కార్తికేయ థర్డ్ ర్యాంక్, అలాగే అగ్రికల్చర్ నేహా కు ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement