Sunday, April 28, 2024

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు బుధవారం ఉదయం విడుదలయ్యాయి. కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఎంసెట్‌ 2021ని విద్యాశాఖ ఎట్టకేలకు సజావుగా నిర్వహించి ఫలితాలు కూడా విడుదల చేసింది. ఎంసెట్ ఫలితాలను హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈనెల 30 నుంచి రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఈ ఏడాది జరిగిన ఎంసెట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌ పరీక్షకు 90 శాతం మంది హాజరుకాగా… అగ్రికల్చర్‌, మెడికల్‌ ఎంట్రన్స్‌కు 91.19 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఫలితాలను ఎలా చూసుకోవాలి?
✪ అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి
✪ అనంతరం హోమ్‌ పేజీలో ఉండే TS EAMCET result 2021 లింక్‌పై క్లిక్‌ చేయాలి.
✪ తర్వాత రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, హాల్‌ టికెట్‌ నెంబర్‌తో పాటు పుట్టిన తేదీని ఎంటర్‌ చేయాలి.
✪ చివరగా సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేసి ఫలితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

ఈ ఏడాది కరోనా కారణంగా ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ ప్రక్రియలో ఇంటర్‌ వెయిటేజ్‌ను ఎత్తివేస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నిజానికి ఇంటర్‌లో వచ్చిన మార్కుల వెయిటేజ్‌ను తీసుకునే వారు. కానీ కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేయడంతో ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ విషయమై ఇప్పటికే ఇంటర్‌ మార్కుల వెయిటేజ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఇంటర్‌లో 45 శాతం మార్కులు ఉంటేనే ఇంజనీరింగ్ సీటు పొందే అవకాశం ఉండేది. కానీ పరీక్షలు రద్దు కావడంతో ఇప్పుడు ఎంసెట్‌లో అర్హత సాధించిన వారందరూ కౌన్సెలింగ్‌కు అర్హులుగా అధికారులు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement