Saturday, April 27, 2024

తెలంగాణలో కొత్తగా 207 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 207 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఇద్దరు కరోనాతో మరణించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. అలాగే ఈరోజు 239 మంది కరోనా బాధితులు కోలుకున్నట్లు ప్రభుత్వం చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,421కి చేరింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 43,135 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement