Saturday, May 4, 2024

తెలంగాణలో కొత్తగా 359 మందికి కరోనా..

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 359 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 73,899 కరోనా పరీక్షలు నిర్వహించారు. అదే సమయంలో 494 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.రాష్ట్రంలో ఇప్పటివరకు 6,54,394 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,43,812 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 6,728 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,854కి పెరిగింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదు పరిధిలో 74 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్, కామారెడ్డి, నారాయణపేట, నిర్మల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

ఇది కూడా చదవండి: కేంద్రం అలా చేస్తే పెట్రోల్ రూ.32 కే వస్తుందట..

Advertisement

తాజా వార్తలు

Advertisement