Monday, April 29, 2024

రేపు తెలంగాణ కేబినెట్ మీట్..లాక్ డౌన్ పై నిర్ణయం..!

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనున్నది. రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో లాక్ డౌన్ విధింపు పై క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించినా కూడా కరోనా అంతగా తగ్గుతలేదని, సరియైన ఫలితాలు లేవని రిపోర్టులు అందుతున్నవి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విధింపు పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొన్ని వర్గాలు లాక్ డౌన్ కావాలని కోరుకుంటున్నపరిస్థితి కూడా వున్నది. ఈ పరిస్థితుల్లో.. లాక్ డౌన్ విధించడం వల్ల కలిగే సాదకబాదకాలతో పాటు, రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోల్ల ప్రక్రియమీద లాక్ డౌన్ ప్రభావం ఏమేరకు ఉంటుందనే అంశం పై క్యాబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నది. తెలంగాణలో లాక్‌డౌన్‌ విధించే అవకాశం లేదని ఇప్పటికే అనేకమార్లు ప్రభుత్వ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌పై ప్రభుత్వ వర్గాల్లోనూ భిన్నాప్రాయాలు ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం కావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement