Tuesday, May 21, 2024

కోహ్లీ మరోసారి ఫెయిల్.. లంచ్ సమయానికి భారత్ 56/4

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. అతడి నుంచి సెంచరీ జాలువారి రెండేళ్లు దాటుతోంది. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులోనూ కోహ్లీ 7 పరుగులకే వెనుతిరిగాడు. దీంతో తొలిరోజు లంచ్ సమయానికి భారత్ 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో కేఎల్ రాహుల్ డకౌట్‌ అయ్యాడు. పుజారా సైతం తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. అతడు ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఈ మూడు వికెట్లను అండర్సన్ తీయడం గమనార్హం. అయితే మరో ఓపెనర్ రోహిత్‌తో కలిసి రహానె కుదుటపరుస్తున్నాడు అనే దశలో అతడు 18 పరుగులు చేసి వెనుతిరిగాడు. ఈ వికెట్ రాబిన్‌సన్‌కు పడగా అన్ని క్యాచ్‌లను కీపర్ బట్లరే అందుకున్నాడు.

ఈ వార్త కూడా చదవండి: పరస్పరం స్లెడ్జింగ్‌పై కోహ్లీ స్పందన

Advertisement

తాజా వార్తలు

Advertisement