Monday, April 29, 2024

కొడుక్కి ఈత నేర్పుతూ.. చెరువులో పడి తండ్రి మృతి

కామారెడ్డి : త‌న కొడుకుకు ఈత నేర్పుతూ తండ్రి చెరువులో పడి మృతి చెందిన సంఘటన కామారెడ్డి పెద్ద చెరువు వ‌ద్ద శనివారంలో జరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అశోక్ నగర్ లో విద్యుత్ శాఖ లైన్ ఇన్ స్పెక్ట‌ర్ గా పనిచేస్తున్న రవికుమార్ తన కొడుక్కి ఈత నేర్పడానికి కామారెడ్డి పెద్ద చెరువు లోకి తీసుకెళ్ళాడు. కొడుకుకి ఈత నేర్పుతుండ‌గా తాను గుంతలో పడి పోయి మునిగిపోయాడు. దీంతో చెరువు బయటకు వచ్చిన కొడుకు కేకలకు పరిసరాల లో ఉన్న వారు వచ్చేసరికి ర‌వి కుమార్‌ నీటిలో మునిగిచనిపోయాడు. దేవునిపల్లి కెసు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement