Sunday, May 5, 2024

మ‌రో శ్రీలంక‌లా మార‌నున్న తెలంగాణ – ఈ నెల 6న తెలంగాణ ఆత్మ‌గౌర‌వ దీక్ష‌-కోదండ‌రామ్

సీఎం కేసీఆర్ విధానాల‌ను నిర‌సిస్తూ ఈ నెల 6న హైద‌రాబాద్ ఇందిరాపార్క్ వ‌ద్ద తెలంగాణ ఆత్మ‌గౌర‌వ దీక్ష‌ను చేప్ట‌నున్నారు తెలంగాణ జ‌న‌స‌మితి అధ్య‌క్షుడు..ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్. తెలంగాణ నిరంకుశ పాలనలో రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవాన్ని కోల్పోయారని చెప్పారు. మిగులు నిధులతో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే తెలంగాణ మరో శ్రీలంక అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. వరంగల్ లో 24 వేల ఎకరాల భూమిని అమ్మేందుకు ప్రభుత్వం యత్నిస్తే ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిందని.. దీంతో ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement