Monday, April 29, 2024

ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిని విజ‌య‌వంతం చేయండి : మంత్రి మ‌ల్లారెడ్డి

ఐదవ విడత పట్టణ ప్రగతిలో భాగంగా తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరాయంజాల్ మల్లన్న కాలనీలో జరిగిన కార్య‌క్ర‌మానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. దాదాపు 5 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మ‌ల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌న్నారు. అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధుల భాగ‌స్వామ్యంతోనే వంద శాతం అభివృద్ధి సాధించ‌గ‌ల‌మ‌న్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్ వాణి వీరా రెడ్డి, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement