Friday, May 3, 2024

ఓటు వెయ్యకపోతే చంపేస్తారా ? టీడీపీ వైసీపీ మధ్య కొట్లాట !!

ఎన్నికలు అయిపోయాయినా ఏపీలో రాజకీయం రగులుతోంది అటు నాయకులు ఒకరిపై ఒకరు మాటలతో విమర్శలు చేసుకుంటే కార్యకర్తలు దాడులు చేసుకుంటున్నారు తాజాగా శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి లో టిడిపి వైసిపి కార్యకర్తలు ఒకరిని ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. సరుబుజ్జిలి మండలం రొట్టవలస లో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య శుక్రవారం ఘర్షణ చోటు చేసుకుంది.

కర్రలు,రాడ్లుతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు అయ్యాయి. టీడీపీ కార్యకర్త బెవర రాజారావు ఇంటిపై వైసీపీ సర్పంచ్ అనుచరులు దాడి చేశారు. వైసిపి కి ఓటు వేయలేదనే నెపంతో రోజూ ఏదో ఒక రూపంలో గొడవలకు దిగుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement