Wednesday, May 22, 2024

టిడిపి నాయకులు టీటీడీ పై తప్పుడు ప్రచారం చేయొద్దు – అశోక్ కుమార్

తిరుపతి ప్రభ న్యూస్.. తెలుగుదేశం పార్టీ నాయకులు టీటీడీ పై తప్పుడు ప్రచారం మానుకోవాలని టిటిడి పాలకమండలి సభ్యులు పోకలఅశోక్ కుమార్ తెలిపారు. బైరాగి పట్టెడలోని ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అశోక్ కుమార్ మాట్లాడుతూ …సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించి కలిగిన తప్పిదాలు టిటిడి దేవస్థానం ఏం జరిగాయి వారి భక్తులకు వివరించాలని కోరారు. అలాగే మొన్న జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు దర్శనాల గురించి ఎంతో ఆనందాన్ని అనుభూతిని కూడా తెలియజేశారు అన్నారు .. ఏ పాలకమండలి చేయని విధంగా సామాన్య భక్తులకు దర్శన ఏర్పాట్లను చేయించ‌మ‌న్నారు.. టిటిడిపై రాజకీయాన్ని చేయవద్దని. రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకో వద్దని హితవు పలికారు. స్వామి వారి ఆలయానికి అపకీర్తి తెచ్చే విధంగా ప్రవర్తించిన వద్దని సూచించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షాలు విపరీతంగా పడుతున్నాయన్నారు . సహజంగా వర్షం పడినప్పుడు రోడ్లు అక్కడక్కడ గొంతులు పడడం జరిగిందని దానిని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సరి కాదని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వాస్తవాలు గ్రహించి మాట్లాడలే తప్ప తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement