Saturday, May 4, 2024

బడ్జెట్ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం

ఈనెల 20న జరిగే ఏపీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. తూతూమంత్రంగా ఒక రోజు జరిపే అసెంబ్లీ సమావేశాలకు తాము హాజరుకాలేమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఆరు నెలలు సమావేశాలు నిర్వహించకపోతే ప్రభుత్వం కుప్పకూలుతుందన్న ఆందోళనతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత అచ్చెన్నాయుడు విమర్శించారు.

ఏపీ బడ్జెట్‌పై విపులంగా చర్చ జరగాలని, తూతూమంత్రంగా చర్చ జరపాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. అందుకే సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించామని అచ్చెన్నాయుడు తెలిపారు. కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్న సమయంలో అసెంబ్లీ సమావేశాలను ఎలా నిర్వహిస్తారని, మార్చిలో 900 కేసులు ఉంటే అప్పుడెందుకు నిర్వహించలేదని టీడీపీ శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement