Sunday, April 28, 2024

తార‌క‌ర‌త్న పెద్ద‌క‌ర్మ‌.. కార్డుపై వెల్ విషర్లుగా బాలయ్య, విజయసాయిరెడ్డి పేర్లు

మార్చి2న న‌టుడు తార‌క‌ర‌త్న పెద్ద‌క‌ర్మ కార్య‌క్ర‌మం జ‌ర‌ప‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి కార్యక్రమం జరుగ‌నుంది. దీనికి సంబంధించిన కార్డును కుటుంబ సభ్యులు ప్రింట్ చేయించారు. కార్డుపై వెల్ విషర్స్ గా బాలకృష్ణ, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్లను వేశారు. తారకరత్న అనారోగ్యానికి గురైనప్పటి నుంచి ఆయన అంత్యక్రియలు ముగిసేంత వరకు బాలయ్య అన్నీ తానై చూసుకున్నారు. విజయసాయిరెడ్డి తారకరత్న భార్య బంధువు అనే సంగతి తెలిసిందే. దీంతో, ఆయన కూడా రాజకీయ విభేదాలను పక్కన పెట్టి పెద్దరికాన్ని ప్రదర్శించారు. చంద్రబాబు, బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, ఇతర కుటుంబసభ్యులతో ఒక బంధువులా కలిసి పోయారు. విజయసాయి వ్యవహరించిన తీరును చాలా మంది హర్షించారు. ఇప్పుడు మరోసారి తారకరత్న పెద్ద కర్మ సందర్భంగా బాలయ్య, విజయసాయి కలవబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement