Monday, April 29, 2024

ఇదేం పైత్యం ? పామును తింటే కరోనా రాదంటూ ప్రచారం!

కరోనా కట్టడికి వ్యాక్సినే ఆయుధమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కొంత మంది వింత పద్ధతులను అనుసరిస్తున్నారు. తాజాగా తమిళనాడులో ఓ వ్యక్తి పామును తింటే కరోనాను రాదంటూ అన్నాడు. తిరునెల్వేలి జిల్లా పెరుమల్​ పట్టి గ్రామానికి చెందిన వడివేలు అనే వ్యక్తి ఓ బతికున్న పామును చంపి తిన్నాడు. ఇది కరోనాకు విరుగుడు అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. దీంతో పర్యావరణవేత్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు వడివేలును అరెస్ట్ చేశారు. ఈ నేరానికి వాడివేల్‌కు రూ .7,500 జరిమానా విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement