Thursday, May 2, 2024

పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ ప్లేయ‌ర్‌ భవీనాబెన్ పటేల్ రజత పతకం సాధించింది. చైనా క్రీడాకారిణి, వరల్డ్‌ నంబర్‌ వన్‌ సీడ్‌ యింగ్‌ జావోతో జరిగిన ఫైన‌ల్‌ పోరులో 3-0తో ఓటమి చెందింది. దీంతో సిల్వర్‌ మెడల్‌తో దేశానికి రానుంది. అయితే పారాలింపిక్స్‌ చరిత్రలో టేబుల్‌ టెన్నిస్‌లో భారత్‌కు పతకం దక్కడం ఇదే తొలిసారి.

గుజరాత్‌కి చెందిన భవీనాబెన్‌ పటేల్ పోలియో కారణంగా చక్రాల కుర్చీకి పరిమితమైంది. తొలుత ఫిట్‌‌నెస్ కోసం సరదాగా టేబుల్ టెన్నిస్ ఆడటం ప్రారంభించిన భవీనా.. ఆ తర్వాత దానినే కెరీర్‌గా ఎంచుకుని కష్టపడింది. మొదట్లో వెనుకబడినా మధ్యలో పుంజుకోవడాన్ని బాగా అలవాటు చేసుకున్నది. మొత్తంగా పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన భారత రెండో అథ్లెట్‌గా అరుదైన ఘనత సాధించింది. 2016లో దీపా మాలిక్ రజత పతకం గెలుపొందిన విషయం తెలిసిందే.

ఈ వార్త కూడా చదవండి: మూడో టెస్టులో టీమిండియా ఘోర ఓటమి

Advertisement

తాజా వార్తలు

Advertisement