Friday, May 17, 2024

అమెరికాలో జింకకు కరోనా

మానవుల్లో అత్యధికంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఇటీవల కాలంలో జంతువులకూ సోకుతోంది. ఇప్పటివరకు కుక్కలు, పిల్లులు, గొరిల్లాలు, చిరుతలు, సింహాలు కరోనా బారినపడగా.. తాజాగా అమెరికాలో ఓ జింకకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఓహియో రాష్ట్రంలో ఓ అడవి తెల్ల తోక జింకకు వైద్య పరీక్షలు నిర్వహించగా, అది వైరస్ బారినపడిన విషయం వెల్లడైంది. జంతువుల నుంచి మనుషులు-జంతువుల మధ్య కరోనా వ్యాప్తిపై ఓహియో స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన వెటర్నరీ కాలేజి పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఈ క్రమంలో కొన్ని జంతువులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, ఒక జింకకు కరోనా సోకిన విషయాన్ని గుర్తించారు. జింకకు కరోనా సోకడం ఇదే తొలిసారి. అయితే ఆ జింకకు కరోనా ఎలా సోకిందన్నది ఇంకా తెలియరాలేదు.

ఇది కూడా చదవండిః తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయం: సబిత

Advertisement

తాజా వార్తలు

Advertisement