Thursday, May 9, 2024

బ్లాక్ లో టీ20 టికెట్లు.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: భారత్‌-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ముగ్గురిని ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మ్యాచ్‌ కాసేపట్లో ఆరంభంకానుండగా ఆదివారం ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడీయం సమీపంలో గుగులోతు వెంకటేష్‌, ఇస్లావత్‌ దయాకర్‌, గుగులోతు అరుణ్‌ బ్లాక్‌లో టిక్కెట్లు విక్రయించసాగారు. గమనించిన ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు చాకచాక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నారు.

టికెట్‌ ధర 850 ఉండగా దాన్ని రూ.11వేలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి ఆరు టిక్కెట్లు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్‌ పోలీసులకు ఆ ముగ్గురినీ అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement