Friday, April 26, 2024

విశాఖలో టీ20.. జూన్‌ 14న ఇండియా – సౌత్‌ ఆఫ్రికా మధ్య మ్యాచ్‌

విశాఖ జిల్లా, ప్రభన్యూస్‌: ఉత్తరాంధ్ర క్రికెట్‌ అభిమానులకు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ శుభవార్త చెప్పింది. విశాఖ క్రికెట్‌ స్టేడియం వేదికగా వచ్చే నెల జూన్‌ 14 ఇండియా-సౌత్‌ ఆఫ్రికా టి20 సిరీస్‌లో ఓ క్రికెట్‌ మ్యాచ్‌ జరగనున్నది. జూన్‌14 న ఇండియా-సౌత్‌ ఆఫ్రికా టి20 సిరీస్‌లో ఓ మ్యాచ్‌కు విశాఖ ఆతిధ్యం ఇవ్వబోతుంది. జూన్‌ 14న విశాఖకు భారత్‌ – సౌతాఫ్రికా టి20 మ్యాచ్‌ కేటాయించడంపై బిసిసిఐకి ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసింది.

క్రికెట్‌ స్టేడియంలో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఇండియా సౌత్‌ ఆఫ్రికా టి20 మ్యాచ్‌కి సంబంధించిన వివరాలను వెల్లడించారు. 27వేల మంది ఈ స్టేడియంలో సరిపోతుందని, మ్యాచ్‌ జరిగే రెండు వారాల ముందు నుంచి టికెట్స్ ఆన్లైన్ లో అమ్మకాలు చేపడతామని తెలియ జేశారు. బ్లాక్‌ టికెటింగ్‌ అరికట్టేందుకు ఆ్లనన్‌ ద్వారా విక్రయించడం జరుగు తుందని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement