Sunday, May 5, 2024

వినాయకచవితి వేళ అంద‌రూ ఇష్టపడే తియ్యటి వంటలు.. ప్ర‌సాదాలు ఏమున్నాయంటే!

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : దేశంలో పండుగ సీజన్‌ వినాయక చవితితో ప్రారంభమవుతుంది. దాదాపు రెండు సంవత్సరాలు కొవిడ్‌ కారణంగా వేడుకలు పెద్దగా చేసుకోలేదు. కానీ ఈసారి మాత్రం వేడుకలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. దేశవ్యాప్తంగా జరుపుకునే వినాయకచవితి పండుగను ఇంటిలో మాత్రమే కాదు అత్యంత ఆనంద కరమైన కమ్యూనిటీ పండుగగా కూడా జరుపుకుంటారు. ఈ పండుగ శోభ అత్యంత అందంగా అలంకరించిన విగ్రహాలతో మరింత అందంగా కనిపిస్తుంది. వినాయకచవితి వేళ గణపతి బప్పా అలంకరణకు సంబంధించి ముం దుగానే ప్రణాళిక చేయడం కనిపిస్తుంటుంది. సంప్రదాయ నేపథ్యాల మొదలు సమకాలీన శైలి వరకూ ఈ అలంకరణ కొనసాగుతుంది.

భారతీయ పండుగ ఏదైనా పసందైన విందు, తియ్యం దనాలు ఉండాల్సిందే. వినాయకచవితి వేళ అది మరింత ముఖ్యం. విగ్రహ స్థాపన రోజు నుంచి నిమజ్జనం వరకూ ఈ నైవేద్యాలను సమర్పించడం జరుగుతుంది. హైదరాబాద్‌ వాసులకు ఖైరతాబాద్ గణేష్‌తో దశాబ్దాల అనుబంధం ఉంది. తెలంగాణాలో అత్యంత ప్రాచుర్యం పొందిన గణేశ మండపం ఇది. 2019లో ఖైరతాబాద్‌ గణేశ విగ్రహాన్ని 60అడుగుల ఎత్తులో రూపొందించారు. దేశంలో అతి ఎత్తైన గణేష్ విగ్రహంగా ఇది ఖ్యాతి గడించింది. వినాయక చవితి వేళ ఇంటిలో జరుపుకునే పూజలతో పాటుగా కమ్యూనిటీలో పూజ జరుపుకోవడమూ ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి రోజూ పూజ చేయడంతో పాటుగా నైవేద్యమూ సమర్పిస్తుంటారు.

బాల గణేషుని కథతో పాటుగా కుడుముల పట్ల ఆయన అభిరుచిని గురించి ప్రతి ఇంటిలోనూ, ప్రతి సంవత్సరం కథల రూపంలో చెబుతూనే ఉంటారు. అయినప్పటికీ ఆ లీలా విశేషాలు మనకు ఆసక్తిగానే ఉంటాయి. నిజానికి ఈ కథలు మన హృదయంలో నిలిచిపోయాయి. ఈ కుడుములకు విభిన్న పేర్లు ఉన్నట్లుగానే విభిన్న రకాలుగా తయారుచేసినప్పటికీ, కొబ్బరి, బెల్లంతో తయారుచేసిన కుడుములను ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు.

బయట రవ్వ కోటింగ్‌ ఇచ్చి కొంకణ్‌లో ములిక్‌గా చేయడంతో పాటుగా సంప్రదాయ మోదక్‌ల్లా అరటిపళ్లతో చేస్తే, కేరళలో మినప్పు, స్పైసెస్‌తో సాల్టీ స్టీవ్డ్‌ు వెర్షన్‌గా ఉప్పు కొజుకత్తైగా తీర్చిదిద్దుతారు. తెలంగాణాలో ఉండ్రాళ్లు, చలివిడి, వడపప్పు వంటి రకాలు ప్రత్యేకంగా కనిపిస్తుంటారు. షాప్‌లలో ప్రతి సంవత్సరం ఈ ఉండ్రాళ్లలో విభిన్న వెర్షన్స్‌ కనిపిస్తుంటారు. వీటితో పాటుగా బాదములు, జీడిపప్పులాంటి డ్రై ఫ్రూట్స్‌ కూడా అందించడం కనిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement