Monday, May 6, 2024

భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయిన‌ సూర్య ‘కంగువ‌’ ఓటీటీ రైట్స్.. వెల్ల‌డించిన మేక‌ర్స్

శివ దర్శకత్వంలో సూర్య హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ కంగువ. తొలిసారిగా సూర్య తో కలిసి శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై సూర్య ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇటీవల టైటిల్ అనౌన్స్ మెంట్ తరువాత ఈ ప్రాజక్ట్ పై మరింతగా హైప్ పెరిగింది. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్స్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ మూవీలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ ఓటిటి హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ కి రూ.80 కోట్లకు అమ్మినట్లు నిర్మాత జ్ఞానవేల్ రాజా కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించారు. అయితే విశేషం ఏమిటంటే, ఈ అమ్మకం ధర కేవలం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషకు మాత్రమే. ఇంకా ఇతర భాషల ఓటిటి రైట్స్ అమ్మకం జరగాల్సి ఉంది. మొత్తంగా పది భాషల్లో అటు 3డి ఫార్మాట్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ కానుంది కంగువ మూవీ. కాగా ఈ మూవీ 2024 లో ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది. మొత్తంగా ప్రస్తుతం కంగువా ఓటిటి రైట్స్ అమ్మకం న్యూస్ కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement