Thursday, May 2, 2024

Suryapet : దేశంలో ప్రధాన పార్టీగా బీఆర్ఎస్ : మంత్రి జగదీష్ రెడ్డి

లోక్ సభ ఎన్నికల నాటికి దేశంలో బీఆర్ఎస్ పార్టీ బలీయమైన శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్బవిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. విజన్ ఉన్న నాయకుడిగా దేశ ప్రజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎనలేని ఆదరణ ఉందని ఆయన పేర్కొన్నారు. శనివారం ఉదయం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో బీఆర్ఎస్ నమోదు చేసుకున్న విజయంపై ఆయన స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో సృష్టించిన ప్రభంజనం సెగలు హస్త‌నకు తాకుతున్నాయాన్నారు. ఎత్తుగడలో భాగమే కర్ణాటక ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉన్నదని ఆయన వెల్లడించారు. బీఆర్ఎస్ పోటీలో లేకపోవడమే అక్కడ కాంగ్రెస్ గెలుపుకు దోహదపడిందన్న అంశాన్ని విస్మరించరాధన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement