Tuesday, April 30, 2024

కరోనా వేళ… సూర్య బ్రదర్స్ రూ.కోటి విరాళం

కరోనా విజృంభిస్తున్న వేళ తమిళనాడు ప్రభుత్వానికి ప్రముఖ హీరోలు సూర్య, అతడి సోదరుడు కార్తీ బాసటగా నిలిచారు. తమిళనాడు సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు సీఎం స్టాలిన్‌ను సూర్య, కార్తీ, వారి తండ్రి శివకుమార్ కలిసి రూ.కోటి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా శివకుమార్ మీడియాతో మాట్లాడారు. కరోనాతో ఇబ్బంది పడుతున్న తమిళులకు ఉపాధి కల్పించే అంశంపై సీఎంతో చర్చించినట్లు తెలిపారు. కరుణానిధి తమకు నాలుగు దశాబ్దాలుగా తెలుసు అని, ఇప్పుడు ఆయన కుమారుడు స్టాలిన్ ముఖ్యమంత్రి కావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement