Sunday, April 28, 2024

IPL | ఆదుకున్న మిడిలార్డర్.. సీఎస్‌కే టార్గెట్ ఎంతంటే

ఐపీఎల్ 17వ సీజన్ తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 12 ఓవర్లలో 78 పరుగులకే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును.. అనుజ్ రావత్, దినేష్ కార్తీక్ ఆదుకున్నారు. వీరిద్దరు సిక్స్‌లు, ఫోర్లతో సీఎస్‌కే బౌలర్లపై విరుచుకుపడ్డారు. తొలి మ్యాచ్‌లో (48) పరుగులతో చెలరేగిన అనుజ్ రావత్ హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.. ఇక దినేష్ కార్తీక్ ( 38- నాటౌట్) పరుగులతో ఆకట్టుకున్నాడు.

ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ 35 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రజత్, మ్యాక్స్‌వెల్ వరుసగా డకౌట్ అయ్యి నిరాశపర్చారు. కోహ్లీ 21 పరుగులు, కెమరాన్ గ్రీన్ 18 పరుగులు చేసి వెనుదిరిగారు. సీఎస్‌కే బౌటర్లలో దీపక్ చాహర్ ఒక వికెట్ దక్కించుకోగా… ముస్తాఫిజుర్ రెహమాన్ 4 వికెట్లతో మెరిసాడు. కాగా, 174 పరుగల టార్గెట్‌తో చెన్నై జట్టు బరిలోకి దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement