Monday, May 6, 2024

లీగల్ మెట్రాలజీ అధికారుల ఆక‌స్మిక దాడులు.. రూల్స్ పాటించ‌ని వారిపై కేసు

విజయవాడ, (ప్రభ న్యూస్): విజ‌య‌వాడ‌లో లీగల్ మెట్రాలజీ అధికారులు కొరడా జూలిపించారు. రూల్స్ పాటించ‌ని వ్యాపారుల‌పై కేసు న‌మోదు చేశారు. కొంతకాలంగా వస్తున్న విమర్శల నేపథ్యంలో రెండు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. విజయవాడ లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ కృష్ణ చైతన్య నేతృత్వంలో అధికారులు బృందాలుగా విడిపోయి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మెరుపు దాడులను నిర్వహించారు.

- Advertisement -

జిల్లాలో ఉన్న బియ్యం, ఎరువులు, నిత్యవసరాలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి బియ్యం, కందిపప్పు, ఎరువులపై ప్యాకేజీ కమోడిటీ రూల్స్ ఉల్లంఘనలు.. తక్కువ తూకము.. రూల్స్ ఉల్లంఘించిన వారిపై చ‌ర్య‌లు తీసుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా నిబంధనలు విల్లంగించిన 30 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement