Thursday, April 25, 2024

దూసుకొచ్చిన మృత్యువు.. ముగ్గురు కూలీలు మృతి

సంగారెడ్డి జిల్లా కొల్లూరు వద్ద ఔటర్‌ రింగురోడ్డుపై లారీ బీభత్సం సృష్టించింది. ఓఆర్‌ఆర్‌పై వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. కొల్లూరు వ‌ద్ద‌ తెల్లవారుజామున నాలుగు గంటలకు హర్యానా నుండి చిత్తూరు వెళుతున్న బియ్యపు లారీ అదుపు తప్పి గుడిసెలోకి దూసుకెళ్లింది. గుడిసెల్లో నివసిస్తున్న ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్‌సహాయంతో లారీని అక్కడిన ఉంచి తొలగించారు. లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంవల్లే లారీ అదుపు తప్పి గుడిసె మీద పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా ఈ దుర్ఘటనలో బాబు రాథోడ్ (48), కమలీ భాయ్(43), రాథోడ్ (23)లు మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement