Sunday, May 5, 2024

కేసీఆర్… మీకెందుకింత అహంకారం : బండి సంజ‌య్

కేసీఆర్ అహంకారంతో గ‌ర్వం త‌ల‌కెక్కి మాట్లాడుతుండటాన్ని దేశ‌మంతా చూస్తోంద‌ని, కేసీఆర్… మీకెందుకింత అహంకార‌మ‌ని, బ‌రితెగించి మాట్లాడుతూ… ఇంకా స‌మ‌ర్థించుకోవ‌డం సిగ్గుచేట‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు, ఎంపీ బండి సంజ‌య్ కుమార్ అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్దనున్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట ‘బీజేపీ బీమ్ దీక్ష’ చేసిన అనంతరం ఆయ‌న మాట్లాడుతూ… టీఆర్ఎస్ నేతలు కూడా బలుపెక్కి అడ్డగోలుగా మాట్లాడుతున్నార‌న్నారు. కేసీఆర్ కు సీఎం పదవి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పెట్టిన భిక్షే అన్నారు. దేశంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకురావాలని చూస్తున్న నీచుడు కేసీఆర్ అన్నారు. ఆ రాజ్యాంగం ప్రకారం…. సీఎం, మంత్రులు సచివాలయానికి వెళ్లొద్దనుకుంటున్నడు. గడీలు నిర్మించుకోవాలనుకుంటున్నడు.

రారాజును నేనే అని కేసీఆర్ భావిస్తున్నడన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం వద్దు… కల్వకుంట్ల రాజ్యాంగమే ముద్దు అని చెబుతున్నడున్నారు. నేనే దోచుకోవాలని, నా అవినీతిని, కుటుంబ పాలనను ఎవరూ ప్రశ్నించొద్దని కేసీఆర్ అనుకుంటున్నడన్నారు. హామీలను నెరవేర్చకూడదు… నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వను…దళితులకు మూడెకరాలు ఇవ్వనంటున్నడన్నారు. అంబేద్కర్ స్థానంలో తన విగ్రహం పెట్టుకోవాలని కేసీఆర్ చూస్తున్నడన్నారు. కేసీఆర్… ఇంకా నీ నియంత పాలనను భరించాలా ? కేసీఆర్ విశ్వాసఘాతకుడు… దేశ ద్రోహి అని బండి సంజ‌య్ అన్నారు. కేసీఆర్… ఆనాడు బ్రిటీషర్లకు పట్టిన గతే నీకు పడుతుందన్నారు. కేసీఆర్ ఈ అంశంపై స్పందించేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కర్నాటక ఎంపీ మునుస్వామి, రాష్ట్ర ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాబూరావు, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారులు వెదిరె శ్రీరాం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, సమన్వయకర్త నూనె బాలరాజ్, తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement