Thursday, May 2, 2024

బావిలో పడి విద్యార్థి మృతి

పామూరు రూరల్ (ప్రభ న్యూస్) : స్థానిక కందుకూరు రోడ్ లోని సిద్ధవటం వెంకటేశ్వర్లు కుమారుడు సిద్ధవటం లీలాకృష్ణ (17) శుక్రవారం కందుకూరు రోడ్ లో గల పెద్ద చెరువు దగ్గర ఉన్న బావిలో శవమై తేలాడు. …అక్షర కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న లీలాకృష్ణ గురువారం సాయంత్రం బైక్ మీద బయటకు వెళ్ళి రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు.ఆ ప్రక్రియలో శుక్రవారం మృతుడి మోటర్ బైక్ డీవీ పార్క్ వద్ద పార్క్ చేసి ఉండడంతో అనుమానమోచ్చిన కుటుంబ సభ్యులు బావి లోకి చూడగా లీలాకృష్ణ శవమై పడి ఉన్నాడు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగం లోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి,కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించినట్టు ఎస్సై కొప్పెర సురేష్ తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement