Monday, May 6, 2024

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల‌తో ముగిశాయి. గత కొన్ని సెషన్లుగా నష్టాలను మూటకట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 847 పాయింట్లు లాభపడి 60,747కి చేరుకుంది. నిఫ్టీ 241 పాయింట్లు పెరిగి 18,101కి ఎగబాకింది. టెక్, ఐటీ, పవర్ సూచీలు లాభాలను ముందుండి నడిపించాయి. అంతర్జాతీయ మార్కెట్ల ర్యాలీ, అమెరికా ఉద్యోగ గణాంకాలు, చైనా ఆంక్షల సడలింపు, రూపాయి స్వల్పంగా బలపడటం వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెట్ ను బలపరిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement