Monday, April 29, 2024

ఐదోరోజు లాభాల‌తో ముగిసిన -స్టాక్ మార్కెట్లు

వ‌రుస‌గా ఐదో రోజు లాభాల‌తో ముగిశాయి స్టాక్ మార్కెట్లు..యూరప్ దేశాలకు రష్యా గ్యాస్ సరఫరా మొదలు కావడం ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 284 పాయింట్లు లాభపడి 55,682కి పెరిగింది. నిఫ్టీ 84 పాయింట్లు పుంజుకుని 16,605 వద్ద స్థిరపడింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ (8.09%), బజాజ్ ఫైనాన్స్ (3.41%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.52%), ఏసియన్ పెయింట్స్ (2.13%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.72%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా మిగిలాయి.. డాక్టర్ రెడ్డీస్ (-1.92%), కోటక్ బ్యాంక్ (-1.05%), రిలయన్స్ (-0.58%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.16%), ఎన్టీపీసీ (-0.07%) టాప్ లూజర్స్ గా నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement