Saturday, May 4, 2024

రేపటి నుంచి రాష్ట్ర స్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌.. జిల్లా స్థాయిలో ఎంపికైన 260 ప్రాజెక్టులు

అమరావతి,ఆంధ్రప్రభ: ఆంధ్రా లయోలా కాలేజీలో ఫిబ్రవరి 27, 28 తేదీల్లో రాష్ట్ర స్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ డా. బి. ప్రతాప్‌రెడ్డి ఇవ్వాల (ఆదివారం) ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 6 నుండి 10 తరగతుల విద్యార్థులు తయారుచేసి, జిల్లా స్థాయిలో ఎంపికైన 260 సైన్స్‌ ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌, సమగ్రశిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్‌.సురేష్‌కుమార్‌ తదితరులు పాల్గొంటారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement