Friday, April 26, 2024

Breaking | నెల్లూరు తోడేరు చెరువులో ప‌డ‌వ బోల్తా.. ఆరుగురు గ‌ల్లంతు

నెల్లూరు జిల్లాలో ఇవ్వాల (ఆదివారం) ఘోరం జ‌రిగింది. పొదలకూరు మండలం తోడేరు గ్రామ చెరువులో సరదాగా ప‌డ‌వ‌లో వెళ్లిన వారు ప్ర‌మాదానికి గుర‌య్యారు. పది మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఇవ్వాల సాయంత్రం సరదాగా పది మంది పిల్లలు చెరువులో బోటు షికారుకు వెళ్లారు. ఆ బోటు ప్రమాదవశాత్తు తిరగబడింది. అందులోంచి నలుగురు క్షేమంగా బయటపడ్డారు, ఆరుగురు గల్లంతయ్యారు. ఘటనా ప్రదేశానికి పొదలకూరు సీఐ సంగమేశ్వరరావు, ఎస్ఐ కరిముల్లా చేరుకొని గాలింపు చర్యలు చేప‌ట్టారు. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement