Friday, April 26, 2024

మ‌రోసారి తాత అయిన.. స్టార్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం

మ‌రోసారి తాత అయ్యారు స్టార్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం.బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ భార్య జ్యోత్స్న నేడు పండండి అమ్మాయికి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని గౌతమ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అమ్మాయి పుట్టడంతో ఆనందం రెట్టింపు అయ్యిందని గౌతమ్ ఇంస్టాగ్రామ్ లో కామెంట్ చేశారు. అలాగే తన కొడుకు అప్పుడే పుట్టిన చెల్లిని చూస్తున్న ఫోటో షేర్ చేశారు. గౌతమ్-జ్యోత్స్నలకు మొదటి సంతానంగా కొడుకు పార్థ పుట్టాడు. తాజాగా ఈ దంపతులు కూతురిని తమ జీవితాల్లోకి ఆహ్వానించారు. బ్రహ్మానందం కి ఇప్పుడు మనవడితో పాటు మనవరాలితో ఆడుకునే అవకాశం లభించింది. బ్రహ్మానందంకి ఇద్దరు కుమారులు కాగా గౌతమ్ హీరోగా పరిశ్రమలో అడుగుపెట్టారు. 2004లో విడుదలైన పల్లకిలో పెళ్లికూతురు మూవీతో లాంఛ్ అయ్యాడు. ఆ మూవీ పర్లేదు అనిపించింది. గౌతమ్ కి మాత్రం అవకాశాలు రాలేదు. చాలా గ్యాప్ తర్వాత 2018లో మను టైటిల్ తో మరో మూవీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement