Thursday, April 18, 2024

మైసూరు బస్టాండ్‌ రూపుమారింది.. మ‌సీదు ఆకృతి నుంచి గుడి మాదిరిగా..

బీజేపీ ఎంపీ ప్రతాప్‌ సింహాహెచ్చరికలతో మైసూరులోని మసీదును పోలిన బస్టాండ్‌ రూపు మార్చుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మైసూరు-ఊటీ రోడ్డులో ఉన్న బస్టాండులో తొలుత మూడు డోమ్స్‌తో బస్టాండ్‌ నిర్మించారు. మధ్యలో ఒకటి పెద్దగా, దానికి అటు అటు రెండు చిన్నడోమ్‌లు ఉండేవి. వీటికి బంగారు రంగు పూత ఉండేది. తాజా మార్పులలో పక్కనున్న రెండు డోమ్‌లను తొలగించి, కేవలం మధ్యలో డోమ్‌ మాత్రమే ఉంచారు.

ఇప్పుడిది గుడి గోపురాన్ని పోలివుంది. బంగారు పూత స్థానంలో డోమ్‌కు ఎరుపు రంగు వేశారు. మసీదును పోలివున్న బస్టాండ్‌ను అధికారులు వెంటనే కూల్చేయాలని, లేదంటే తానే జేసీబీతో నేలమట్టం చేస్తానని ఎంపీ హెచ్చరించారు. కాగా, బస్టాండ్‌లో జరిగిన మార్పుల ఫోటోలను ఎంపీ సిన్హా ఆదివారంనాడు అందరికీ షేర్‌ చేశారు. తన ఆందోళనతో ఏకీభవించి, స#హకరించిన బీజేపీ ఎమ్మెల్యే రామ్‌దాస్‌కు, స్థానిక యంత్రాంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement