Saturday, May 4, 2024

మరో వివాదంలో శ్రీశైలం ఈవో..! (Video)

మల్లన్న దర్శనానికి వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారి స్వామి మాలదారణ ధరించి మంత్రి పెద్దరెడ్డికి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం విమర్శలకు కారణమైంది. ఈవో లవన్న వ్యవహార శైలిని చూసి శివ భక్తులు మండిపడ్డారు. మల్లన్న శివమాల ధరించిన ఆలయ అధికారి మంత్రి కాళ్లను మొక్కడంపై భక్తులు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తపరిచారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న శ్రీశైల దేవస్థానం ఈవోను సస్పెండ్ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మల్లన్న సాక్షిగా భక్తులకు క్షమాపణ చెప్పాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. గవర్నర్ విశ్వభుషన్ హ‌రిచందన్ రానున్న నేపథ్యంలో చోటు చేసుకున్న వైనంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలు, పలు వివాదాల్లో కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఆలయ అధికారి.. మంత్రి పెద్దిరెడ్డిపై స్వామి భక్తి చూపడంపై మరో వివాదం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పూర్తిగా విఫలం కావడంతో భక్తులు ఆగ్రహంకు కారణమైతే,
వీఐపీ పాసులు అధిక సంఖ్యలో జారీ చేయడంతో జిల్లా అధికారుల నుంచి సైతం చివాట్లు తప్పలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement