Monday, April 29, 2024

TS | కన్నతల్లిపై కొడుకు కర్కశత్వం.. పేగు బంధం మరిచి కాలితో తన్ని

నిజామాబాద్ (ప్రభ న్యూస్) : కన్నతల్లి పై కొడుకు కర్కశత్వం చూపాడు… విచక్షణారహితంగా కాలితో తన్నుతూ ముఖంపై పిడి గుద్దులు కురిపిస్తూ.. దాడికి పాల్పడ్డాడు. కనీసం తిరగబడి ప్రతిఘటించలేని తల్లి కన్నీరు మున్నీరుగా విలపించిన ఈ హృదయ విదారక ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్ లో చోటు చేసుకుంది.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్ లో గొల్ల గంగామణి నివాసం ఉంటుంది. గంగామణికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్ని నెలల క్రితం పెద్ద కుమారుడు మరణించాడు. చిన్న కుమారుడు గొల్ల పవన్ కుమార్ మేస్త్రీ పని పనిచేస్తూ దుబ్బ ప్రాంతంలో నివాసం ఉంటాడు. ఆదివారం గౌతమ్ నగర్ లోని పెద్ద కుమారుడి వద్ద ఉన్న గొల్ల గంగామణి వద్దకు గొల్ల పవన్ కుమార్ వచ్చాడు. అకారణంగా తల్లిపై దుర్భాషలాడుతూ కాలితో తన్నుతూ.. విచక్షణ రహితంగా ప్రవర్తించాడు. కనీసం పైకి లేచే ఓపిక లేక పోవడంతో కన్నీరు మున్నిరైన తల్లి వేదన అరణ్య రోదనగా మారింది… వెంటనే స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో… పవన్ కుమార్ వెళ్లిపో యాడు. ఈ దాడిలో రక్తపు మడుగులో తీవ్ర గాయాలైన గంగామణిని స్థానికులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. మొఖం, కంటి, దవడ భాగంలో ఎముకలు విరిగి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement