Tuesday, May 14, 2024

జ‌నాల‌పైకి దూసుకెళ్లిన టిప్ప‌ర్ – ఆరుగురు స్పాట్ డెడ్

తమిళనాడు : తమిళనాడులో ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్నటూవీలర్స్ వాహనదారులు, పాదచారులపైకి టిప్పర్ లారీ దూసుకెళ్ళింది. స్పాట్ లోనే ఆరుగురు మ‌ర‌ణించారు.. 10 మందికి పైగా గాయ‌ప‌డ్డారు.. వేగంగా జనాల‌పైకి టిప్ప‌ర్ దూసుకురావ‌డంతో అక్కడంతా బీభత్స వాతావరణం నెలకొంది. అరుపులు, హాహా కారాలు, రక్తం మరకలు, మాంసముద్దలుగా ఆ ప్రాంతం అంతా భయానకంగా తయారయ్యింది. . చెంగల్ పట్టు కుదువాంచేరి సమీపంలోని పోతేరి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

టిప్పర్ లారీ తిరుచ్చి నుంచి చెన్నె వెళ్లుండ‌గా ఈ ఘటన జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స కోసం స‌మీపంలోని హాస్ప‌ట‌ల్స్ త‌ర‌లించారు.. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement