Monday, April 29, 2024

క్వార్టర్స్ లోనే సింధు ఇంటిముఖం… సెమీస్ లో ప్ర‌ణ‌య్, ప్రియాన్షు రాజ‌పుత్ లు

సిడ్నీ: ఇండియ‌న్ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ పీవీ సింధు ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ బ్యాడ్మింట‌న్ టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. క్వార్ట‌ర్స్‌లో ఆమె అమెరికా క్రీడాకారిణి బీవెన్ జాంగ్ చేతిలో 21-12, 21-17 స్కోరుతో ఓట‌మిపాలైంది. పీవీ సింధు ప్ర‌స్తుతం 17వ ర్యాంక్‌లో ఉంది. జాంగ్ వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ 12 ర్యాంక్‌లో ఉన్నారు. అంతకు ముందు రెండో రౌండ్ లో అస్మితా చాలిహ‌పై 21-18, 21-13, తొలి రౌండ్ 16లో ఆక‌ర్షి క‌శ్య‌ప్‌ను 21-14, 21-10 స్కోరుతో ఆమె ఓడించింది. అయితే క్వార్టర్స్ గీత మాత్రం దాటలేకపోయింది.. ఈ ఏడాది సింధూ ఇప్పటి వరకు ఆడిన 9 టోర్నమెంట్ లలో ఒక్క టైటిల్ ను కూడా గెలువ లేకపోయింది.. ఏకంగా ఏడు టోర్నమెంట్స్ లో తొలి రౌండ్ లోనే ఓడిపోవ‌డం సింధూ ఫామ్ పై ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.. గ‌త నెల‌లోను కొత్త కోచ్ ను నియ‌మించుకున్న సింధూ ద‌శ మాత్ర మార‌లేదు ..

సెమీస్ లో ప్ర‌ణ‌య్, ప్రియాన్షు రాజ‌పుత్ …

ఇక పురుషుల విభాగంలో ప్ర‌ణ‌య్, ప్రియాన్షు రాజ‌పుత్ లో క్వార్ట‌ర్స్ ఫైన‌ల్స్ లో విజ‌యాలు సాధించి సెమీస్ లోకి అడుగుపెట్టారు..క్వార్ట‌ర్స్ ఫైన‌ల్ లో ప్ర‌ణ‌య్ 16 -21 , 21 – 17, 21 – 14 స్కోర్ తో అంతోనిపై గెలుపొందాడు.. మ‌రో మ్యాచ్ లో పియూన్షు రాజ‌పుత్ త‌న స‌హ‌చ‌ర భార‌త క్రీడాకారుడు కిదాంబి 21 -13, 21- 8 స్కోర్ తో ఓడించి సెమీస్ పోరుకి సిద్ద‌మ‌య్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement