Friday, May 17, 2024

Vizag: సింహాచ‌లం పాల‌క మండ‌లి స‌మావేశం వాయిదా

సింహాచ‌లం పాల‌క మండ‌లి స‌మావేశం వాయిదా ప‌డింది. ఆల‌య పాల‌క మండ‌లి భేటీకి స‌భ్యులు డుమ్మా కొట్టారు. అశోక్ గ‌జ‌ప‌తిరాజు స‌భ్యుల కోసం అర‌గంట వేచి చూశారు. ఈవో తో పాటు ఇద్దరు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. సభ్యులు రాకపోవడంతో సమావేశం వాయిదా పడింది. సింహాచలం ఆలయ కమిటీపై అశోక్ గజపతి రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైనా పొరపాటు జరిగితే తనను సస్పెండ్ చేయడానికి చాలా కళ్లు ఎదురు చూస్తున్నాయన్నారు. ఆ దేవుడు నడిపించే వరకు తన దగ్గర తప్పు జరగదన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement